299
యేసు నాథ కథా మాధుర్యము
రా - బిలహరి, తా - త్రిపుట
యేసు నాథ కథా ¹సుధా రస - మిదిగో పానముఁ జేయరే = దోసకారి జనంబులారా - దురిత భవముల బాయరే ||యేసు||
1.ఇహపరంబు లెవనిచే సృజి - యింపఁబడియెనొ చూడరే = అసహహ యా విభుఁ డవతరించెను - అతని గుణములఁ బాడరే ||యేసు||
2.²దురిత భరితుల దుష్ట ²చరితుల - నరయ వచ్చెను జూడరే=స్థిరముగామది నమ్మి యా ప్రభు - కరుణ మదిఁ గొనియాడరే ||యేసు||
3.పనికిమాలిన ⁴వేలుపుల దెస - పరుగు లెత్తుట మానరే = ⁵తనువు మీ కొఱ కిచ్చు క్రీస్తుని - దయకుఁ బాత్రతఁ బూనరే ||యేసు||
4.మరణ బలి రక్తమున మన యం -దఱిని బ్రోవను వచ్చెను = కరుణతోఁ బాపులఁ బిలుచు గురు - దరికిఁబోవుద మిచ్ఛను ||యేసు||
5.పరమతత్వ విధాన బోధలు - బాగుగఁ బ్రకటించెను = ⁶చిరసుఖాస్పద పదముఁ గోరిన - జీవులకు వినిపించెను ||యేసు||
6.మరణ మొందిన కొందఱికిఁ దా - మరలఁ బ్రాణము లిచ్చెను = వర మహాద్భుత కార్యముల ని - ద్ధర ననేక మొనర్చెను ||యేసు||
7.కుటిల బుద్ధుల ద్రోచి సజ్జన - గోష్టి నుండుట గోరరే = దిటముగను నెమ్మదిని మీరొం - దుటకుఁ క్రీస్తునిఁ జేరరే ||యేసు||
- పురుషోత్తము చౌదరి
_______________________________________
¹అమృతము, ²పాపములతో నిండియున్నవారిని, ³దుర్మార్గమైన ప్రవర్తనగలవారిని, ⁴దేవతల, ⁵దేహము, ⁶ఎల్లప్పటికి ముఖకారణమైన.
No comments:
Post a Comment