Showing posts with label Missionary in India. Show all posts
Showing posts with label Missionary in India. Show all posts

06 October 2024

Roberto de Nobili రాబర్ట్ డి నోబిలీ

📚 *ఒక మిషనరీ జీవిత చరిత్ర* 📚 
🛐 *Roberto de Nobili రాబర్ట్ డి నోబిలీ* 🛐



రాబర్ట్ డి నోబిలీ (1577 – 16 జనవరి 1656) 17వ శతాబ్దికి చెందిన క్రైస్తవ మత ప్రచారకుడు, ప్రబోధకుడు, సన్యాసి. ఆయన ప్రముఖంగా దక్షిణ భారతదేశంలో(సిలోన్ వంటి ప్రాంతాల్లో కొన్నేళ్ళు) క్రైస్తవ మతాన్ని బోధిస్తూ జీవించారు. తత్త్వబోధానంద స్వామి అన్న పేరు పెట్టుకుని, హిందూ సన్యాసుల వేషంలో, వారి మతంలోని పదజాలాన్నే వాడుతూ ప్రజలను క్రైస్తవంలోకి తిప్పేవారు. అప్పటివరకూ ముందు ప్రచారం చేసిన క్రైస్తవ ప్రచారకులు విఫలం కాగా రాబర్ట్ డి నోబిలీ క్రైస్తవంలోకి ప్రజలను తీసుకురావడంలో విజయవంతం కావడంతో కొన్నేళ్ళపాటు భారతీయ క్రైస్తవ ప్రబోధకుల్లోనూ, ఆయనను పంపిన చర్చి ఆధ్యాత్మిక నేతల్లోనూ మంచిపేరు తెచ్చుకున్నారు. ఐతే మరికొందరు తోటి క్రైస్తవ ఫాదర్లు నోబిలీ హిందువుల ఆచారాలు, నమ్మకాలు అనుకరిస్తూ ప్రచారం చేయడం అసమంజసం అంటూ వాదన లేవదీయడంతో అదే క్రైస్తవ ప్రచారకుల్లో అపకీర్తి పాలు కూడా అయ్యారు. చివరకు హిందూసాధువులు, సన్యాసులు జీవించేలాంటి కష్టసాధ్యమైన జీవితం సాగించడంలో కలిగిన అనారోగ్యం వల్ల మరణించారు. రాబర్ట్ డి నోబిలీ 1577 సెప్టెంబరులో మోన్టెపుల్కియానో, టస్కనీ ప్రాంతంలో జన్మించారు. ఆయన మే 20, 1605లో పశ్చిమ భారతంలోని గోవా కు చేరుకున్నారు. పోర్చుగీసుల పరిపాలనలోని గోవా అప్పటి భారతదేశంలోని క్రైస్తవ మిషన్లకు ముఖ్యకేంద్రంగా ఉండేది. ఆయన భారతీయ సంస్కృతికి, క్రైస్తవ మతానికి మధ్య సమన్వయాన్ని సాధించాలన్న ఆలోచనలో క్రీస్తపురాణమనే గ్రంథరచనలో ఉన్న ఫ్రాన్సిస్ థామస్ స్టీఫెన్స్‌ను కలిసివుంటారని చరిత్రకారుల భావన. ఆపైన ఆయన భారతదేశంలో క్రైస్తవ మిషనరీగా చాలా విచిత్రమైన పద్ధతిలో పనిచేశారు.

రాబర్ట్ డి నోబిలీ హిందూ సన్యాసి వేషభాషలు స్వీకరించి హిందువుల పద్ధతిలోనే క్రైస్తవాన్ని ప్రచారం చేశారు. ఆ క్రమంలో ఆయన హిందూమతస్తులు అవలంబించే కొన్ని మత సాంస్కృతిక పద్ధతులను క్రైస్తవానికి ఆమోదయోగ్యమని ప్రకటించేవారు. ఈ వ్యవహారానికి పరాకాష్టగా తత్త్వబోధక స్వామిగా మార్చుకున్నారు.

కొందరు రాబర్టో డి నోబిలీని యజుర్వేదం అనే పురాతన సంస్కృత గ్రంథానికి ఫ్రెంచ్ అనువాదంగా భావించే నకిలీ పత్రం యొక్క రచయితగా గుర్తించారు. మాక్స్ ముల్లర్ డి నోబిలీ దాని రచయిత కాదని నిర్ధారించారు. లూడో రోచెర్ ఈజోర్వేదం యొక్క వివరణాత్మక అధ్యయనాన్ని ప్రచురించాడు, ఈ గ్రంథం యొక్క రచయిత ఫ్రెంచ్ మిషనరీ అయి ఉండాలి మరియు అతను అనేక పేర్లను ప్రతిపాదించాడు. ఉర్స్ యాప్ జీన్ కాల్మెట్ (1692–1740) రచయితగా సాక్ష్యాలను అందించింది.

2013 శరదృతువులో, లయోలా విశ్వవిద్యాలయం చికాగో తన లేక్ షోర్ క్యాంపస్‌లో డి నోబిలి హాల్ అనే రెసిడెన్స్ హాల్‌ను ప్రారంభించింది. ఈ ఐదు-అంతస్తుల భవనంలో సుమారు 200 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, అంతర్జాతీయ లెర్నింగ్ కమ్యూనిటీ మరియు 350-సీట్ల డైనింగ్ హాల్ ఉన్నాయి.

విశ్వనాథ సత్యనారాయణ రచించిన తెలుగు చారిత్రక నవల ఏకవీరలో, తత్త్వబోధక స్వామి పాత్ర డి నోబిలి ఆధారంగా కనిపిస్తుంది. అతను హిందూ సన్యాసి వేషధారణ మరియు సన్యాసి జీవన శైలిని ధరించి క్రైస్తవ మతాన్ని బోధించాడు మరియు కథానాయకుడు ఏకవీరతో ఉపన్యాసం మరియు చర్చలో పాల్గొంటాడు.

భారతదేశంలోని జార్ఖండ్‌లో, అతని పేరు మీద డి నోబిలి స్కూల్ పేరుతో 8 జెస్యూట్-నడపబడుతున్న పాఠశాలలు ఉన్నాయి. వారు కౌన్సిల్ ఫర్ ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CISCE), న్యూఢిల్లీకి అనుబంధంగా ఉన్నారు.

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...